పాలక్ పనీర్ దోసె


పాలక్ - పనీర్ దోసె తయారు చేయు విధానము

పాలక్ - పనీర్ దోసె తయారికి కావలసిన పదార్థములు మార్చు

  1. మినపప్పు - 100గ్రా.,
  2. బియ్యం - 200గ్రా.,
  3. శనగపప్పు - 50గ్రా.
  4. పాలకూర - రెండు కట్టలు,
  5. టొమాటోలు - 100గ్రా.,
  6. పచ్చిమిర్చి - 10,
  7. పనీర్ తురుము - కప్పు,
  8. బంగాళదుంప - మూడు,
  9. పోపుసామాను - టీస్పూను,
  10. ఉప్పు - తగినంత,
  11. నూనె - తగినంత

పాలక్ - పనీర్ దోసె తయారి: మార్చు

మినప్పప్పు, బియ్యం, శనగ పప్పు... ఈ మూడింటిని శుభ్రంగా కడిగి కనీసం ఆరు గంటల సేపు నానబెట్టి గ్రైండ్ చేయాలి. ఆ మిశ్రమానికి ఉప్పు కలిపి రాత్రంతా అలాగే ఉంచితే ఉదయానికి పిండి గుల్లగా పొంగుతుంది. ముందుగా బంగాళ దుంపలతో కూర చేసి పక్కన పెట్టుకోవాలి. (బంగాళదుంపలను ఉడికించి పైన తొక్క ఒలిచి మెత్తగా చేసుకోవాలి. బాణలిలో నూనె కాగిన తరవాత అందులో పోపు వేసి ఉడికించిన బంగాళదుంపముద్ద, ఉప్పు, పసుపు వేసి బాగా మెత్తగా చేయాలి) పాలకూరను శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా తరగాలి. టొమాటోలను కూడా ముక్కలు చేసుకోవాలి. తగినన్ని పచ్చిమిరపకాయలను వేసి ఈ మూడింటినీ కలిపి ఉడికించి గ్రైండ్ చేస్తే, పాలక్ పేస్టు తయారవుతుంది. పెనం మీద దోసె వేసుకుని కొద్దిగా కాలిన తరవాత దానిమీద ఈ పాలక్ పేస్టును పూసి, ఆ పైన సన్నటి పనీర్ తురుమును వేసి కొద్దిగా కాలిన తరవాత తీసేయాలి.