మినపపిండి వడియాలు

మినప ఒడియాలు మార్చు

  • కావలసిన పదార్థాలు
  1. మినపగుళ్ళు - 1 కేజీ
  2. పచ్చిమిరపకాయలు: 1/4 కేజీ
  3. ఉప్పు - తగినంత
  4. ఇంగువ - 1 స్పూన్
  5. ఇంగువ : కొద్దిగా
  • తయారీ విధానం
  1. ముందురోజు రాత్రి మినపగుళ్ళను నీళ్ళలో నానపెట్టుకోవాలి.
  2. మరునాడు ఉదయం మినపపప్పును కడిగి, మెత్తగా గారె పప్పులా రుబ్బుకోవాలి.
  3. మరునాడు ఉదయం మినపపప్పును కడిగి, మెత్తగా గారె పప్పులా రుబ్బుకోవాలి.
  4. మిరపకాయల పేస్టుని, ఇంగువను మినపపిండిలో వేసి బాగా కలుపుకొవాలి.
  5. ఒక తడిపిన పాత చీర మీద కానీ, ప్లాస్టిక్ పేపరు మీద కాని చిన్న చిన్నవి గా ఒడియాలు పెట్టుకొని 2 రోజులు ఎండలో ఉంచితే మినప ఒడియాలు తయారవుతాయి..

మినప పిండి వడియాలు 1 మార్చు

  • కావలసినవి:
  1. మినప్పప్పు - 250 గ్రా;
  2. పచ్చిమిర్చి - 10;
  3. అల్లం - చిన్నముక్క;
  4. జీలకర్ర - టేబుల్‌స్పూన్‌;
  5. ఉప్పు,
  6. ఇంగువ - తగినంత
  • తయారుచేసే విధానం:
  1. మినప్పప్పును ముందురోజు నానబెట్టి మరుసటిరోజు ఉదయాన్నే గ్రైండర్‌లోవేసి మెత్తగా రుబ్బుకోవాలి.
  2. పచ్చిమిర్చి, జీలకర్ర అల్లం, ఉప్పు, మూడిటినీ మిక్సీలో వేసి పేస్ట్‌ చేసి, ఈ మిశ్రమాన్ని పిండిలో వేసి మరోమారు తిప్పాలి.
  3. ప్లాస్టిక్‌ పేపర్‌ మీద కాని, పల్చటి తడి వస్త్రం మీద కానీ ఈ పిండిని చిన్నచిన్న వడియాలుగా పెట్టాలి.
  4. ఎండలో నాలుగు రోజులు ఎండాక తీసేయాలి